కరోనా సెకండ్ వేవ్ వలన థియేటర్స్ మూతపడడంతో విడుదల కావలసిన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. థర్డ్ వేవ్ కూడా ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్స్ తిరిగి తెరచుకునే అవకాశం కనిపించడం లేదు. కొందరు హీరోలు ముందస్తు జాగ్రత్తగా తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అయితే సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ కూడా ఓటీటీలో విడుదల అవుతుందని కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తుంది.
తాజాగా లవ్ స్టోరీ చిత్ర విడుదలపై స్పందించిన నిర్మాత సునీల్ నారంగ్ ఈ సినిమాకు ఏకంగా 10 ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. అయినప్పటికీ మా చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏ ఓటీటీకీ సినిమాను ఇవ్వలేదని ఆయన చెప్పారు. బిగ్ స్క్రీన్లలోనే ఈ సినిమా చూస్తారని నారంగ్ వ్యాఖ్యానించారు. జూలై 30న లవ్ స్టోరీ సినిమా వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇందులో ఎంత నిజం ఉందనేది చూడాలి.