‘ఖైదీ’ ‘విక్రమ్’ చిత్రాలతో టాలెం‘ఖైదీ’ చిత్రంతో టాలెంటెడ్ డైరెక్టర్గా గుర్తింపును సంపాదించుకున్నాడు లోకే ష్ కనకరాజ్. ముఖ్యంగా ‘విక్రమ్’ కమల్హాసన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కమల్హాసన్తో కలిసి ఓ తమిళ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు ప్రణాళికల్ని వివరించారు లోకేష్ కనకరాజ్.
లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో రాబోయే పదేళ్లలో వరుస సినిమాలు తీస్తానని తెలిపారు. విజయ్తో సినిమా పూర్తయిన తర్వాత ‘ఖైదీ-2’ ఉంటుందని, ఈ సినిమా అనంతరం ‘విక్రమ్’కు సీక్వెల్ను పట్టాలెక్కిస్తానని వెల్లడించారు. ‘విక్రమ్’ సినిమా ైక్లెమాక్స్లో మాఫియా డాన్ రోలెక్స్ పాత్రలో మెరిసిన అగ్ర హీరో సూర్యతో ఓ సినిమా తీస్తానని..దానికి ‘రోలెక్స్’ అనే పేరు ఖరారు చేశానని తెలిపారు.
‘విక్రమ్’ సినిమాలో మాఫియా డాన్ రోలెక్స్గా అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు సూర్య. ఇప్పుడు అదే పేరుతో లోకేష్ కనకరాజ్ సినిమాకు ప్లాన్ చేస్తుండటంతో సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.