టాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలలో లైగర్ మూవీ ఒకటి. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్ కాబట్టి..ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ను ఓ కీలక పాత్రలో తీసుకున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
వచ్చే ఏడాది ఆగస్ట్ 25న లైగర్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మరో వైపు కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న ‘లైగర్’ నుంచి గ్లింప్స్ను విడుదల చేస్తున్నారు. న్యూ ఇయర్కి ముందు విజయ్ నుండి వచ్చే సర్ప్రైజింగ్ వీడియో ఫ్యాన్స్కి సరికత్త ఉత్సాహం అందించడం ఖాయం. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేయడంతో పాటు ఛార్మితో కలిసి పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్పై నిర్మిస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్గా ఈ చిత్ర షూటింగ్ యూఎస్లో జరగగా, ఆ సమయంలో మైక్ టైసన్ షూటింగ్లో పాల్గొన్నాడు. ఆ షెడ్యూల్లో అతనికి సంబంధించిన చిత్రీకరణ ముగిసింది.