టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు లైగర్ (Liger). విజయ్దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ రోల్ పోషిస్తుండగా..పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ సినిమాలపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ బయటకు వచ్చింది. సెన్సార్ బోర్డు లైగర్ చిత్రానికి క్లీన్ యూఏ సర్టిఫికెట్ జారీచేసిందని లేటెస్ట్ టాక్.
ఇక సినిమా రన్ టైం 2 గంటల 20 నిమిషాలు కాగా..ఫస్ట్ హాఫ్ గంట 15 నిమిషాలు, సెకండాఫ్ గంట 5 నిమిషాలు ఉండనుందట. సినిమాలో 7 ఫైట్స్, 6 పాటలుండబోతున్నాయని సమాచారం. అంతేకాదు సెన్సార్ బోర్డు మెంబర్స్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారట. మొత్తానికి లైగర్ విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేస్తూ అభిమానులు, మూవీ లవర్స్లో జోష్ నింపుతోంది.
బాలీవుడ్ హీరోయిన్ అనన్యపాండే (Ananya Pandey) ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. లైగర్ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీ రోల్ చేస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై అపూర్వ మెహతా, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా లైగర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరల్డ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆగస్టు 25న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.