గత నవంబర్ నెలలో యువ హీరో వరుణ్తేజ్తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి. ఈ జంట వివాహం ఇటలీలో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ నవదంపతులు తమ కెరీర్పై దృష్టి పెడుతున్నారు. వరుణ్తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో బిజీగా ఉండగా.. లావణ్య త్రిపాఠి ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్సిరీస్తో ప్రేక్షకుల ముందుకురానుంది. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. డిస్నీప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. బుధవారం ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మన జీవితాల్లో అనుకోకుండా ఏర్పడే కొన్ని బంధాలు ఎలాంటి మలుపులకు కారణమవుతాయనే కాన్సెప్ట్తో ఈ సిరీస్ను తెరకెక్కించాం. ఆద్యంతం వినోదప్రధానంగా ఉంటుంది. అన్ని వర్గాల వారు కనెక్ట్ అవుతారు’ అని చెప్పారు. అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు, ఝాన్సీ, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్న ఈ సిరీస్కు కెమెరా: ఆదిత్య జవ్వాది, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, దర్శకుడు: విశ్వక్ ఖండేరావ్.