ముంబై : ప్రముఖ నేపథ్య గాయనీ లతా మంగేష్కర్ మరికొద్ది రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందనున్నారు. ఈ విషయాన్ని ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రతాత్ సమదానీ వెల్లడించారు. ఆమెకు ప్రస్తుతం వైద్య సహాయం అవసరమన్న ఆయన.. మరికొద్ది రోజులు ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు. అతని పరిస్థితి మునుపటిలాగే ఉందని, ప్రస్తుతం ఆమెను కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదన్నారు.
గత వారం రోజులుగా ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఐసీయూలోనే ఉంచినట్లు వైద్యుడు ప్రతీత్ సమదానీ పేర్కొన్నారు. లతా మంగేష్కర్ ఆరోగ్య సమాచారాన్ని బహిరంగపరచడం ఇష్టం లేదని డాక్టర్ విలేకరులతో తెలిపారు. లతా మంగేష్కర్ ఏడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో అనేక భారతీయ భాషల్లో దాదాపు 30వేలకుపైగా పాడారు. మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, 15 బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డులతో పాటు అనేక అవార్డులను పొందారు.