సినీ సెలబ్రిటీలకి కార్లు, బైకులపై మక్కువ ఎక్కువ ఉంటుందనే సంగతి మనందరికి తెలిసిందే. ఎంత ఖర్చైన కూడా మార్కెట్లోకి వచ్చిన కొత్త వాహనాలని కొనుగోలు చేసేందుకు చాలా ఆసక్తి చూపుతుంటారు. ఆ మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్.. లంబోర్ఘిని కారుని కొనుగోలు చేశారని, దాదాపు రూ. 5కోట్ల విలువైన ఈ కారులో రామ్ చరణ్ని కలిసేందుకు వెళ్లారంటూ ప్రచారం జరిగింది.దీనిని ఎన్టీఆర్ పీఆర్ఓ ఖండించారు.
ఎన్టీఆర్ లంబోర్ఘిని ఉరుస్ కారు బుక్ చేయడం నిజమే కాని, అది రావడానికి కొంత సమయం పడుతుందని వివరణ ఇచ్చారు. అయితే ఆగస్టు 16న లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సుల్ కారు ఇండియాలో లాంచ్ అయింది. ఇండియాలో దీని రేటు 3 కోట్లకు పైనే ఉంది. అత్యాధునిక ఫీచర్లతో అత్యంత అద్భుతంగా డిజైన్ చేసిన ఈ కార్లో త్వరలోనే తారక్ హైదరాబాద్ రోడ్ల మీద షికారు చెయ్యబోతున్నారు.
బెంగుళూరుకి చెందిన ఆటో మొబైలియార్డెంట్ లంబోర్ఘి కొత్త మోడల్ ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఎప్పుడు ఈ కారులో రయ్మంటూ దూసుకుపోతాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత కొరటాలతో సినిమా చేయనున్నాడు.మరోవైపు తారక్ హోస్ట్ చేస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఆగస్టు 22 నుంచి ప్రసారం కాబోతుంది.