సాయిరోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘లగ్గం’. రమేష్ చెప్పాల దర్శకుడు. వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా టాకీపార్ట్ పూర్తయింది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పెళ్లి నేపథ్యంలో తెలుగు సంప్రదాయాలను కళ్లకు కడుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం.
పెళ్లి తాలూకు ఆటపాటలు, మర్యాదలు, భావోద్వేగాలతో సాగుతుంది. తెలంగాణ నేపథ్యంలో చక్కటి ప్రేమకథగా అలరిస్తుంది’ అన్నారు. సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్రెడ్డి, సంగీతం: చరణ్ అర్జున్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: రమేష్ చెప్పాల.