మెగాస్టార్ చిరంజీవికి రికార్డులు కొత్తేమి కాదు. ఆయన కెరియర్లో ఎన్నో సాధించారు. త్వరలో ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించనుండగా, ఈ సినిమా రిలీజ్కు ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం మణిశర్మ స్వరపరచిన ఫస్ట్ సింగిల్ లాహే లాహే విడుదల కాగా, ఈ సాంగ్ 50 మిలియన్ మార్క్ ను టచ్ చేసి మెగాస్టార్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ సాంగ్ గా నిలిచింది.
రామ్ చరణ్, పూజా హెగ్డేలు కూడా ఆచార్య చిత్రంలో నటిస్తుండగా, వారిద్దరిపై చిత్రీకరించిన సాంగ్ను కూడా త్వరలో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. దేవాలయ శాఖలో జరిగిన అవినీతి నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నారు.