Kushi | విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్నది. చిత్రీకరణ పూర్తయింది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. తాజాగా ఈ సినిమాలో ‘ఖుషి’ అంటూ సాగే మూడో పాటను శుక్రవారం విడుదల చేశారు. దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యం అందించిన ఈ పాటను స్వరకర్త అబ్దుల్ వాహబ్ స్వయంగా ఆలపించారు.
‘నువ్వు కనపడితే ఖుషి..నీ మాట వినపడితే ఖుషి’ అనే పల్లవితో సాగిన ఈ పాటను మెలోడీ ప్రధానంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా గీతాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, ఫీల్గుడ్ లవ్స్టోరీగా ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి.మురళి, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రచన-దర్శకత్వం: శివ నిర్వాణ.