నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’. స్వప్న సినిమాస్ సంస్థ నిర్మించింది. గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు శ్రీనివాస్ స్క్రీన్ప్లే, సంభాషణలందించారు. ఈ నెల 28 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత స్వప్నదత్ మాట్లాడుతూ ‘నిత్యామీనన్ పాత్ర భావోద్వేగాలతో సాగుతుంది. కుటుంబమంతా కలిసి హాయిగా ఆస్వాదించే సిరీస్ ఇది’ అని చెప్పింది. మనచుట్టూ కనిపించే పాత్రలతో అందంగా తీర్చిదిద్దిన సిరీస్ ఇదని దర్శకురాలు నందిని రెడ్డి పేర్కొంది.