హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్న అందాల తార కృతిసనన్. మహేష్బాబు హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’లో తన అందంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కృతి.. తాజాగా ‘క్రూ’ సినిమాతో బాక్సాఫీస్ తలుపుతట్టింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఈ ఇండస్ట్రీలో నటిగా, హీరోయిన్గా కొనసాగడం అనుకున్నంత ఈజీ కాదు. సినిమా హిట్ అయితే ఓకే. లేకుంటే దానికి హీరోయిన్దే బాధ్యత అనేట్టుగా చాలామంది మాట్లాడుతారు. అంతేకాదు, సినిమా ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం కథానాయికే అని తీర్మానిస్తారు.
నేను నటించిన సినిమా ఫ్లాప్ అయితే దానికి నేనే కారణం అని కామెంట్స్ చేస్తుంటారు. మొదట్లో ఇలాంటి వ్యాఖ్యలకు చాలా బాధపడేదాన్ని. అయితే, ఇప్పుడు వాటికి అలవాటు పడ్డాను. ఏదైనా పనిలో సక్సెస్ కాకపోతే నెపం అమ్మాయిల మీదికి నెట్టేస్తుంటారు. తప్పుపట్టడం చాలా ఈజీ. అయితే, ఇది సరైన పద్ధతి కాదు. సినిమా హిట్, ఫ్లాప్ ఒకరి చేతుల్లో ఉండదు. దానికి టీమ్ మొత్తం కారణం అవుతుంద’ని చెప్పుకొచ్చింది కృతి.