Kriti Sanon | వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నటిస్తూ సినీరంగంలో తనకంటూ పత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి కృతి సనన్. దక్షిణాదిలో మహేష్బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి ప్రస్తుతం ఉత్తరాదిలో ఫుల్ ఫామ్లో ఉంది. మధ్యలో నాగచైతన్యతో ‘దోచేయ్’ సినిమా చేసింది. మళ్ళీ ఇప్పటి వరకు మరో సౌత్ సినిమాలో నటించలేదు. కాగా ప్రభాస్తో ‘ఆదిపురుష్’ చిత్రంతో మళ్ళీ సౌత్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇదిలా ఉంటే ఈమె అక్షయ్ కమార్ హీరోగా తెరకెక్కిన ‘బచ్చన్పాండే’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం మార్చి 18న విడుదలకానుంది. చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉంది.
ప్రమోషన్లలో భాగంగా కృతి హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరోలతో పాటు హీరోయిన్లకు సమ ప్రాధాన్యత లేదని తెలిపింది. అంతే కాకుండా స్క్రీన్ స్పేస్ ఇవ్వడానికి ఇష్టపడే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారని తెలిపింది. హీరోకన్న ఎక్కువ స్పేస్ హీరోయన్లకు లేదని, 60 శాతం హీరోయిన్లకు 40 శాతం హీరోలకు పాత్ర చేసే పరిస్థితి లేదని పేర్కొంది. అయితే అక్షయ్ కమార్కు అలా లేదని, కథ నచ్చడంతో అత్రాంగి రే సినిమాలో చిన్న పాత్రలో నటించాడిని సిద్ధపడ్డాడని ప్రమోషన్లలో భాగంగా వెల్లడించింది.
యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన బచ్చన్ పాండే చిత్రం తమిళంలో సూపర్ హిట్టయిన ‘జిగార్తాండ’ చిత్రానికి రీమేక్గా తెరకెక్కింది. తమిళంలో బాబి సింహా పాత్రలో అక్షయ్ కుమార్ నటించగా, సిద్ధార్థ్ పోషించిన పాత్రలో కృతి సనన్ నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలను పెంచాయి. జాక్వలీన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా నటించింది. తెలుగులోనూ ఈ చిత్రం ‘గద్దలకొండ గణేష్’గా ఇదివరకే రీమేక్ అయింది. వరుణ్ తేజ్ ఈ రీమేక్లో హీరోగా నటించాడు.