Kriti Sanon | ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో సిల్వర్ స్క్రీన్పై మెరిసి తెలుగు ప్రేక్షకులను పలుకరించింది కృతిసనన్ (Kriti Sanon). ఆ తర్వాత హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ బ్యూటీ ఇటీవలే ప్రభాస్తో ‘ఆదిపురుష్’ లో నటించింది. ఈ మూవీలో సీత పాత్రలో మెరిసి మంచి మార్కులు కొట్టేసింది. వరుస ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్న కృతిసనన్కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇవాళ కృతిసనన్ బర్త్ డే సందర్భంగా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. కృతిసనన్ సొంతంగా స్కిన్ కేర్ బ్రాండ్ Hyphenను లాంఛ్ చేసింది. వందశాతం శాఖాహార , ప్లాస్టిక్ రహిత పదార్థాలతో తమ ఉత్పత్తులు ఉండబోతున్నాయని కంపెనీ తెలిపింది. పెటా ఆమోదం కూడా పొందిందని తెలియజేసింది.
ఫైనల్గా మీ ముందుకు.. నేడు 27 జులై 2023న మీ అందరినీ హైఫన్ ప్రపంచానికి స్వాగతిస్తున్నప్పుడు నా హృదయం సంతోషంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. హైఫన్ అనేది కొత్త అవకాశాలతోపాటు జీవితానికి మరిన్ని అధ్యాయాలను జోడించే ఆశ. నా జీవితంలోని ఈ అధ్యాయం చాలా ప్రత్యేకమైనది.. అంటూ కృతిసనన్ స్కిన్ బ్రాండ్ గురించి చెప్తున్న వీడియోను షేర్ చేయగా.. నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
కృతిసనన్ ప్రస్తుతం టైగర్ ష్రాఫ్తో కలిసి గణ్పథ్ పార్ట్ 1లో నటిస్తోంది. దీంతోపాటు మరో రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
స్కిన్ కేర్ బ్రాండ్ Hyphen వీడియో..