Krish Jagarlamudi | హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ డ్రగ్స్ పార్టీలో టాలీవుడ్ సినీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక క్రిష్ ను విచారించేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. క్రిష్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందేనని పోలీసులు తెలిపారు. అయితే గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరుకాకుండా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు క్రిష్.
ఇక ఈ పిటిషన్లో ”వివేకానంద ఇచ్చిన స్టేట్మెంట్తో నన్ను నిందితుడిగా చేర్చారని క్రిష్ పేర్కొన్నాడు. నాకు డ్రగ్స్ పార్టీతో సంబంధమే లేదు. నేను డ్రగ్స్ తీసుకున్నాననడానికి ఆధారాలు లేవు. కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారు. ప్రస్తుతం తాను ముంబైలో ఉన్న కారణంగా పోలీసుల విచారణకు రాలేనని, మరో రెండు రోజుల సమయం కావాలని కోరారు”. దీంతో ఈ ముందస్తు బెయిల్పై విచారణ జరిపిన హైకోర్టు రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని గచ్చిబౌలి పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.