క్రాంతి, శ్రీలు జంటగా నటిస్తున్న సినిమా ‘కొత్త రంగుల ప్రపంచం’. ఈ చిత్రాన్ని శ్రీ పీఆర్ క్రియేషన్స్ పతాకంపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. నటుడు పృథ్వీ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర టీజర్ను నటుడు సుమన్ చేతుల మీదుగా హైదరాబాద్లో విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు పృథ్వీ మాట్లాడుతూ…
‘మా సినిమా టీజర్ను విడుదల చేసిన సుమన్ గారికి థాంక్స్. ఈ చిత్రంతో దర్శకుడిగా మీకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ప్రేమలో యువత అనుభూతి చెందే కొత్త రంగుల ప్రపంచం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తున్నాం. నా కూతురు శ్రీలు నాయికగా నటించింది. కొత్త తరహా ప్రేమ కథా చిత్రమిది. సకుటుంబంగా చూసేలా ఉంటుంది.’ అన్నారు. విజయ్ రంగరాజు, అశోక్ కుమార్, గీతా సింగ్, జబర్దస్త్ నవీన్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : శివారెడ్డి, సంగీతం : ఆదిత్య.