Koratala Siva Next Project’s | టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ‘ఆచార్య’ ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రామ్చరణ్ కీలకపాత్రలో నటించాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను మొదలు పెట్టింది. శనివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్లో జరుగనున్న విషయం తెలిసిందే. కొరటాల ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్తో సినిమాను చేయనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉండగానే కొరటాల ఎన్టీఆర్ సినిమా తర్వాత ముగ్గురు స్టార్స్తో సినిమాలు చేయనున్నట్లు వెల్లడించాడు.
కొరటాల శివ ఎన్టీఆర్ తర్వత మహేష్తో సినిమా చేయనున్నట్లు తెలిపాడు. గతంలో వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దాంతో మహేష్తో హ్యట్రిక్ సినిమాను చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో పాటుగా చరణ్, అల్లుఅర్జున్లతో రెండు ప్రాజెక్ట్లు ఉన్నాయి. ఈ ఇద్దరి డేట్స్ను బట్టి ఒక ప్రాజెక్ట్ను ముందు స్టార్ట్ చేస్తా అని తెలిపాడు. అంతేకాకుండా ఇప్పడు వీటి గురించి మాట్లాడటం కరెక్టు కాదు అంటూ తెలిపాడు. ఇక ఆచార్య విషయానికి వస్తే, ఇప్పటికే ఈ చిత్రం రెండు సార్లు వాయిదా పడింది. ఇటీవలే ఈ చిత్రానికి సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. మేకర్స్ ఈ చిత్రాన్ని 2 గంటల 34 నిమిలషాల నిడివితో విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే తెలిపారు.