నల్లమల అరణ్యంలోకి గ్రాసం కోసం తన గొర్రెల మందను తోడ్కొని పోయిన రవీంద్రయాదవ్ అనే యువకుడికి అక్కడ ఎదురైన జీవన్మరణ పరిస్థితులు, వాటిని తట్టుకొని అడవిని జయించిన వీరోచిత పోరును ఆవిష్కరిస్తూ దర్శకుడు క్రిష్ రూపొందించిన చిత్రం ‘కొండపొలం’. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కించారు. వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా నటించారు. ఈ నెల 8న విడుదలకానుంది. ఈ చిత్రంలోని ‘నీలో నాలో..శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ..ఆశలో పొద్దుల్ని మరిచే హాయి మోశా..’ అనే గీతాన్ని గురువారం విడుదల చేశారు. కీరవాణి స్వరకల్పనలో రొమాంటిక్ భావాలతో ఈ పాట సాగింది. ఈ గీతానికి కీరవాణే సాహిత్యాన్ని అందించడం విశేషం. యామిని ఘంటసాల, పీవీఎస్ఎన్ రోహిత్ ఆలపించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వీఎస్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఆర్ట్: రాజ్కుమార్ గిబ్సన్, నిర్మాణ సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత: సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి, దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి.