Commonwealth Games: వచ్చే ఏడాది బర్మింగ్హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్లో మహిళల క్రికెట్ అరంగేట్రం చేయనుంది. కామన్వెల్త్ గేమ్స్ మహిళల టీ20 పోటీలు జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరుగుతుందని నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. ఎనిమిది జట్లు గ్రూప్ దశలో తలపడనున్నాయి. ఆగస్టు 4 వరకు గ్రూప్ దశ మ్యాచ్లు నిర్వహిస్తారు. ఆగస్టు ఆరో తేదీన సెమీస్ పోరు ఉంటుంది. కాంస్య పతకానికి సంబంధించిన మ్యాచ్ను ఆగస్టు 7న జరగనుంది. అదే రోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.
ఏప్రిల్ 1 నాటికి ఆతిథ్య ఇంగ్లాండ్ సహా ఐసీసీ మహిళల టి20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న ఆరు జట్లు నేరుగా ఈ గేమ్స్ పాల్గొనేందుకు అర్హత సాధించనున్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత మహిళల జట్టు ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. మిగిలిన ఒక బెర్త్ కోసం అర్హత పోటీలు నిర్వహించారు. నాలుగు ఏండ్లకు ఒకసారి జరిగే కామన్వెల్త్ గేమ్స్లో 1998 కౌలాలంపూర్లో జరిగిన పోటీల్లో పురుషుల క్రికెట్ పాల్గొనగా ఆ తర్వాత నిలిపివేశారు. 24 ఏళ్ల తర్వాత మళ్లీ కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ మ్యాచ్లు చూడబోతున్నాం.