Singer Bamba Bakya Passes Away | ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కోలీవుడ్ సింగర్ బాంబా బాక్య (49) మృతి చెందాడు. ఈయన మృతికి ఇంకా కారణం తెలియలేదు. కానీ పలు తమిళ మీడియా సంస్థలు బాంబా బాక్య గుండెపోటుతో మరణించినట్లు తెలుపుతున్నారు. ఇక ఈయన తమిళంలో పలు చార్ట్ బస్టర్ పాటలు పాడి, సింగర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్’ లోని ‘పొంగేనది’ పాటను ఈయనే ఆలపించాడు. బాంబా బాక్య మరణం పట్ల కోలీవుడ్ సీని ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
బాంబా బాక్య ‘రోబో 2.0’ చిత్రంలో ‘పుల్లినంగల్’ పాటతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘సర్కార్’ చిత్రంలో ‘సింతాంగరం’, పొన్నియిన్ సెల్వన్లో ‘పొన్నినది’ వంటి పలు పాటలను ఆలపించాడు. ఎక్కువగా ఏ.ఆర్ రెహామాన్ సినిమాల్లోనే బాంబా బాక్య పాటలు పాడాడు. సినిమాల్లోకి రాకముందు ఈయన డివోషనల్ సాంగ్స్ పాడేవాడు. బాంబా బాక్య మరణం పట్ల హీరో కార్తి ట్విట్టర్లో ‘బాంబే బాక్య ఆకస్మిక మరణం భాద కలిగించింది. ఈ భాదను, నష్టాన్ని తట్టుకునే శక్తి ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఉండాలిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
Really saddened by the sudden demise of Bamba Bakiya. I pray that his family and friends have the strength to bear this huge loss. #RIPBambaBakiya
— Actor Karthi (@Karthi_Offl) September 2, 2022