ప్రముఖ నటుడు మహేశ్బాబుకు స్పెయిన్లో మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ సమేతంగా మహేశ్బాబు స్పెయిన్ వెళ్లారు. శస్త్ర చికిత్స ముగిసిన అనంతరం ఆయన దుబాయ్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం మహేశ్బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. మహేశ్బాబు లేని సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తోంది. 2022, ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో సర్కారు వారి పాట సినిమా విడుదల కానుంది.