Kishkindhapuri | యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కిష్కింధపురి’. ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా.. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. హారర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం మిరాయ్కి పోటిగా సెప్టెంబర్ 12న వచ్చి సూపర్ హిట్ను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఈ సినిమా అక్టోబర్ 17 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు దీపావళి కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం టెలివిజన్ జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతున్నట్లు నిర్వహాకులు వెల్లడించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ) ఘోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌస్ టూర్స్ నిర్వహిస్తుంటారు. అలా 11 మందితో కలిసి పాడుబడిన సువర్ణమాయ రేడియో స్టేషన్కి వెళ్తారు. అక్కడ వేదవతి అనే ఆత్మ వాయిస్ వినిపిస్తుంది. లోపలికొచ్చిన వారందరినీ వదిలిపెట్టనని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వేదవతి ఎవరు? ఎందుకు ఆత్మగా మారింది? సువర్ణమాయ నుంచి బయటపడటానికి రాఘువ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది మిగతా కథ.
The scare will see you and find your fears!
Get ready for #KishkindhapuriOnZee5 on #ZEE5Telugu
🎬 World OTT & Television Premiere – Don’t miss it!@BSaiSreenivas @anupamahere @Koushik_psk @sahugarapati7 @chaitanmusic @Shine_Screens pic.twitter.com/wTVtxBNHpf— ZEE5 Telugu (@ZEE5Telugu) October 10, 2025