kiran abbavaram | వైవిధ్య భరిత సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక మైన స్థాన్నాన్ని ఏర్పరుచుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. రాజావారురాణిగారు, SR కళ్యాణమండపం వంటి సినిమాలతో వరుసగా హిట్లను సాధించాడు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం సెబాస్టియన్ పిసి 524. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్టైనమెంట్స్ సంస్థలో జోవితా సినిమాస్ బ్యానర్పై సిద్ధారెడ్డి, ప్రమోద్, రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ విడుదలచేశారు.
నీకు రేచికటి ఉన్న విషయం ఎవరికి చెప్పొద్దయ్యా అంటూ మొదలైన టీజర్..పేరెమో క్రిస్టియన్లాగుండాది వచ్చేదెమో గుడికాడ్నుండా అంటూ వచ్చే డైలాగ్ హస్యాస్పదంగా ఉంది. దయగల ప్రభువా ఈ రాత్రి మదనపల్లి పట్టన ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడు తండ్రి నీకు స్తోత్రం. ప్రభువా.. ఒకరాత్రి వీళ్లకు కళ్లు కనపడకుండా చూడు ప్రభువా! ఎన్ని వణుకుతాయో అర్థం కావడం లేదు. దేవుడి బిడ్డలకు రోగాలస్తాయా ఫాదర్ అంటూ కిరణ్ అమాయకంగా అడగడం దానికి ఫాదర్ ప్రభువు తన బిడ్డలని వాటి నుండి దూరంగా ఉంచుతాడు అని చెప్పడం…అంటే నేను దేవుడి బిడ్డను కాను..ప్రభువా నీ బిడ్డను కాని ఈ బిడ్డను కూడా ఏ రోగాలు సమస్యలు రాకుండా చూడు తండ్రి’ అంటూ కిరణ్ అబ్బవరం పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నువేక్ష, కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇందులో రేచికటున్న పోలీస్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటించనున్నాడు.