‘ఈగ’ సినిమాలో విలన్గా మెప్పించిన కిచ్చ సుదీప్ లక్కీ చాన్స్ కొట్టేశాడు. ఆయన చేయబోయే సినిమాలో కమర్షియల్ కథకుడు విజయేంద్ర ప్రసాద్ భాగం అవుతుండటమే అందుకు కారణం. ‘ఈగ’ తర్వాత సుదీప్కు తెలుగులోనూ అభిమానులు పెరిగారు. ఆయన నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవుతుంటాయి. తను ‘సైరా నరసింహారెడ్డి’లో కీలక పాత్ర పోషించాడు. గత ఏడాది విడుదలైన కన్నడ చిత్రం ‘విక్రాంత్ రోణ’ తెలుగులోనూ రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. సుదీప్ తాజా చిత్రం ‘కబ్జా’ మాత్రం ఓ మోస్తరు విజయం సాధించింది. ‘ఈగ’ విలన్కు మరో గ్రాండ్ విక్టరీ కట్టబెట్టాలని విజయేంద్ర ప్రసాద్ రంగ ప్రవేశం చేశాడు. ‘కబ్జా’ దర్శకుడు ఆర్.చందూ డైరెక్షన్లో రాబోయే సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నాడట. ఈ వార్త కన్నడ చిత్రసీమలో వైరల్ అవుతున్నది. రాజమౌళి సినిమాలకు కథ అందించిన ఆయన తమ హీరోకు కథ ఇస్తుండటంతో సినిమా సెట్స్ వరకూ వెళ్లకముందే… హిట్ ఖాయమంటూ కిచ్చ సుదీప్ ఫ్యాన్స్ సంబురపడుతున్నారు.