బాలీవుడ్ బ్యూటీఫుల్ పెయిర్ కియారా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం మంగళవారం రాజస్థాన్లో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యఘఢ్ ప్యాలెస్లో కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అయితే మంగళవారం పెళ్లి చేసుకున్న ఈ జంట తొలిసారి మీడియా ముందు కనిపించింది. బుధవారం ఇద్దరూ ఢిల్లీకి వెళుతుండగా.. జైసల్మేర్ విమానాశ్రయంలో కెమెరా ముందు చిక్కారు. ఎయిర్పోర్టులో ఈ కొత్తజంట అందరికి అభివాదం చేస్తు ముందుకుసాగారు. కియారా పూర్తిగా నలుపు రంగు దుస్తులు ధరించగా.. ఆమె చేతికి పింక్ బ్యాంగిల్స్, నుదుటిపై సిందూరం ధరించి కనిపించింది. అలాగే సిద్ధార్థ్ వైట్ టీ-షర్ట్, బ్రౌన్ జాకెట్, బ్లూ జీన్స్ ధరించి కనిపించాడు.
ఇక హిందీ చిత్రసీమలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న కియారా అద్వాణీ తెలుగులో ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం రాంచరణ్- శంకర్ కాంబోలో వస్తున్న ##RC15లో కియారా నటిస్తుంది.