ఈ మధ్య కాలంలో బికినీ వేసేందుకు అందాల భామలు ఏ మాత్రం మొహమాటపడడం లేదు. విహారయాత్రలకు వెళ్లడం అక్కడ బికినీలో తెగ రచ్చ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ కియారా అద్వాని బికినీ ధరించి సముద్రం అడుగున ఈత కొడుతున్నట్టు కనిపిస్తుంది. మనం అలలను ఆపలేకపోవచ్చు కానీ వాటి ద్వారా ఈత కొట్టడం నేర్చుకోవచ్చు అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.
కియారా షేర్ చేసిన ఫొటోకి అతికొద్ది సమయంలోనే దాదాపుగా పది లక్షల పైచిలుకు లైకులు, కామెంట్లు చేశారు. కియారా అద్వానీ టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన “వినయ విధేయ రామ” చిత్రంలో హీరోయిన్గా నటించగా, ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఒక్కసారిగా కియారా అద్వానీ సినిమా భవిష్యత్తు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రశ్నార్థకంగా మారింది. ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు లేక పోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ అమ్మడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది.