Kiara Advani-Sidharth Malhotra | బాలీవుడ్ ప్రేమ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం మంగళవారం రాజస్థాన్లో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగ్రహ్ ప్యాలెస్లో కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహం అనంతరం బుధవారం ఈ కొత్త జంట ఢిల్లీ చేరుకుంది. విమానాశ్రయం వద్ద మీడియా మిత్రులను కలిసింది. ఈ సందర్భంగా వారికి స్వీట్స్ బాక్స్లను అందించింది.
ఇక హిందీ చిత్రసీమలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న కియారా అడ్వాణీ తెలుగులో ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం రాంచరణ్- శంకర్ కాంబోలో వస్తున్న ##RC15లో కియారా నటిస్తుంది.