‘ఖల్నాయక్’ (1993) చిత్రం సంజయ్దత్ కెరీర్లో ఓ మైలురాయి. ఆ రోజుల్లో యువతరాన్ని ఉర్రూతలూగించి కల్ట్ క్లాసిక్గా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి ‘ఖల్నాయక్ రిటర్న్స్’ పేరుతో సీక్వెల్ను ప్రకటించారు. శనివారం ముంబయిలో జరిగిన ఈవెంట్లో సినిమా తాలూకు ఇంట్రో టీజర్ను రిలీజ్ చేశారు. ఇందులో ‘ఖల్నాయక్’ థీమ్ని ఉపయోగించడం హైలైట్గా నిలిచింది. టీజర్లో ఐకానిక్ యాంటీ హీరో భల్లు పాత్రలో సంజయ్దత్ సరికొత్త మేకోవర్తో కనిపించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సంజయ్దత్.. 1993 ముంబయి పేలుళ్లకు సంబంధించిన కేసులో జైలులో ఉన్నప్పుడు ‘ఖల్నాయక్’ సీక్వెల్ ఐడియా వచ్చిందని చెప్పారు. ‘ఈ సినిమాకు సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందని జైలులోని చాలా మంది ఖైదీలను అడిగాను. అందరూ బాగుంటుందని చెప్పారు. సీక్వెల్ కాన్సెప్ట్ ఎలా ఉండాలో ఓ పేపర్ మీద రాసివ్వమని ఖైదీలందరినీ కోరాను. వారు ఇచ్చిన వందలకొద్ది పేజీలను చదివినప్పుడు సీక్వెల్కు సంబంధించిన ఐడియా తట్టింది. బెయిల్ మీద బయటికి వచ్చాక ఈ స్క్రిప్ట్ను డెవలప్ చేశా’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘ఖల్నాయక్’ చిత్ర దర్శకనిర్మాత సుభాష్ఘాయ్ కూడా పాల్గొన్నారు. సీక్వెల్ మేకింగ్లో తాను సూచనలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. జ్యోతిదేశ్ పాండే ‘ఖల్నాయక్ రిటర్న్స్’కు క్రియేటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.