కేజీఎఫ్ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమకు బ్లాక్ బస్టర్ హిట్టు అందించాడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel). కేజీఎఫ్, కేజీఎఫ్2 ప్రాజెక్ట్లతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని చాటి చెప్పాడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ యశ్ (Yash)ను యూనివర్సల్ స్టార్గా నిలబట్టడమే కాకుండా.. ప్రశాంత్ నీల్కు స్టార్ డైరెక్టర్ స్టేటస్ తెచ్చిపెట్టింది.
తాజాగా ప్రశాంత్నీల్కు సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ప్రశాంత్ నీల్ ట్విటర్ ఖాతా (Twitter account)ను డీయాక్టివేట్ చేశాడు. ఈ స్టార్ డైరెక్టర్ రీసెంట్గా యశ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరి ట్వీట్ చేశాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ఇంతకీ ఇలా హఠాత్తుగా ట్విటర్ను డీయాక్టివేట్ చేయడానికి కారణమేంటని అంతా చర్చించుకుంటున్నారు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తన సినిమాలపై ఫోకస్ పెట్టడానికి కొన్ని రోజులపాటు ఆన్లైన్కు దూరంగా ఉండాలనుకుంటున్నాడని, అందుకే ట్విటర్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని ఇన్సైడ్ టాక్.మూవీ లవర్స్ సినిమా అప్డేట్స్ కోసం ప్రశాంత్ నీల్ పేజీని సందర్శిస్తుంటారని తెలిసిందే. అయితే కేజీఎఫ్ డైరెక్టర్ ఇలా సడెన్గా అకౌంట్ నిలిపివేసేసరికి అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సలార్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ మళ్లీ ట్విటర్లోకి రావడానికి ఎన్నాళ్లు పడుతుందో చూడాలి.