‘రొమాంటిక్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ భామ కేతిక శర్మ. పూరి జగన్నాథ్ నిర్మించిన ఈ చిత్రంలో ఆకాష్ పూరి హీరోగా నటించారు. ఈ సినిమాతో యువ ప్రేక్షకులను ఆకర్షించిందీ తార. ఆ తర్వాత నాగశౌర్య సరసన ‘లక్ష్య’, వైష్ణవ్ తేజ్తో ‘రంగ రంగ వైభవంగా’ చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది. వరుసగా ఈ రెండు చిత్రాల్లో నటిస్తూ నవ నాయికగా క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో కేతిక కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. ఇటీవల జయాపజయాలపై స్పందించిందీ హీరోయిన్. కేతిక మాట్లాడుతూ…‘ఒక సినిమా ఫలితాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించను. ఆ చిత్రానికి నాయికగా నేనేం చేయగలనో అది చేస్తాను. రిజల్ట్ నా చేతిలో ఉండదు. యూత్ఫుల్ మూవీతో తెరంగేట్రం చేసినా నాకు సకుటుంబంగా చూసే చిత్రాల్లో నటించడం అంటేనే ఇష్టం. ప్రస్తుతం కొన్ని చిత్రాలకు సంప్రదింపులు జరుగుతున్నాయి. అలాగే వెబ్ సిరీస్ల ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అయితే నా తొలి ప్రాధాన్యత సినిమాలకే. ఏదైనా బాగా నచ్చిన స్క్రిప్ట్ దొరికితే వెబ్ సిరీస్ చేస్తా. బయోపిక్స్లో నటించాలనేది నా కల’ అని చెప్పింది.