‘దసరా’ చిత్రంలో అచ్చ తెలంగాణ అమ్మాయి వెన్నెల పాత్రలో చక్కటి అభినయంతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది కీర్తి సురేష్. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని సోషల్మీడియాలో అభిమానులతో ముచ్చటించిన కీర్తి సురేష్ పలు ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. ‘మహానటి’ సినిమాలో పోషించిన సావిత్రి పాత్ర తర్వాత ‘దసరా’ సినిమాలో వెన్నెల క్యారెక్టర్కు అంతటి స్పందన లభిస్తుంది కదా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కీర్తి సురేష్ స్పందిస్తూ ‘ఈ రెండు పాత్రలు వేటికవి ప్రత్యేకమైనవే.
‘మహానటి’ బయోపిక్ కాబట్టి ఆ సినిమా కోసం చేసిన కసరత్తులు వేరు. సావిత్రి పాత్రలో బరువైన భావోద్వేగాల్ని పండించడం ఓ సవాలుగా అనిపించింది. ఇక ‘దసరా’ చిత్రంలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించా. తెలంగాణ యాసను శ్రద్ధతో నేర్చుకున్నా. నా కెరీర్లో ఈ రెండు చిత్రాలు చిరస్థాయిగా నిలిచి పో తాయి’ అని పేర్కొంది. మంచి అబ్బాయి దొరికినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, ఆ విష యాన్ని తానే ముందుగా అందరితో పంచు కుంటా నని కీర్తి సురేష్ తెలిపింది.