‘బేబీ జాన్’తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఆ సినిమా ఫెయిల్యూర్గా నిలిచినా ఈ భామ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. తాజాగా కీర్తి సురేష్ బాలీవుడ్లో మరో బంపరాఫర్ను దక్కించుకుంది. రాజ్కుమార్ రావుతో కలిసి ఆమె ‘రాఫ్తార్’ అనే చిత్రంలో నటించనుంది. ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించనున్నారు. శనివారం ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడింది.
షూటింగ్ ప్రారంభించామని, జూలైలో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. విద్యా వ్యవస్థ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని, ప్రేమకథకు కూడా ప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్లో కనిపిస్తుందని, బాలీవుడ్లో ఆమె కెరీర్కు బ్రేక్నిచ్చే చిత్రమవుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో నటిస్తున్నది.