Keerthy Suresh | ప్రస్తుతం దక్షిణాది ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కనిపిస్తున్నది. ఇక్కడి అగ్ర నాయికలు హిందీ సినిమాల వైపు చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుతో పాటు కెరీర్లో మరింతగా ఎదగడానికి హిందీ సినీరంగాన్ని మంచి మార్గంగా భావిస్తున్నారు. ‘జవాన్’ చిత్రంతో నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సమంత వెబ్సిరీస్లతో హిందీలో రాణిస్తున్నది. ఈ నేపథ్యంలో దక్షిణాదికి చెందిన మరో అగ్ర కథానాయిక కీర్తి సురేష్ బాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమైంది.
వరుణ్ధావన్ సరసన ఆమె నటించబోతున్నట్లు తెలిసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్న ఈ సినిమాకు దర్శకుడు అట్లీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్లో కీర్తి సురేష్ జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ భామ తమిళంలో ‘సైరన్’ ‘రఘు తాథ’ ‘రివాల్వర్ రీటా’ ‘కన్నివిడి’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.