రేపటి గురించి దిగులు లేదని, ఇప్పుడొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తానని చెబుతున్నది అగ్ర నాయిక కీర్తి సురేష్. ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను అందుకున్నదీ తార. ప్రస్తుతం ఈ నాయిక ఉదయ్ నిధి స్టాలిన్తో ‘మా మన్నన్’, నాని సరసన ‘దసరా’, చిరంజీవి సోదరిగా ‘భోళా శంకర్’ చిత్రాల్లో నటిస్తున్నది. తన కెరీర్ గురించి కీర్తి మాట్లాడుతూ…‘రేపటి అవకాశాల గురించి నాకు దిగులు లేదు. వచ్చిన సినిమాలకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తా. హీరోయిన్ హోదా ఒక్కటే సరిపోదు. ఒక సినిమా ఎంపిక ముందు హీరో, దర్శకుడు, నా క్యారెక్టర్, కథలోని ఫీల్ అన్నీ నాకు ముఖ్యమే. తెరపై విశిష్టమైన మహిళ పాత్రల్లో నటించడానికి ఇష్టపడతా’ అని చెప్పింది.