Keedaa Cola | పెళ్లి చూపులు (Pelli Choopulu), ఈ నగరానికి ఏమైంది (ENE) వంటి బంపర్ హిట్ల తర్వాత తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వంతో వస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola ). తరుణ్ భాస్కర్, బ్రహ్మనందం, చైతన్య రావు, రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్లను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలు పెట్టింది.
ఇక ప్రమోషన్స్లో భాగంగా ‘కీడా కోలా’ చిత్రబృందం విజయవాడ వస్తున్నట్లు ప్రకటించింది. విజయవాడలోని పీవీపీ మాల్లో ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు కీడా కోలా టీం ఈవెంట్ ఉందని విజయవాడ వచ్చేయండి అంటూ మేకర్స్ ట్విట్టర్ లో రాసుకోచ్చారు. ఆడుతూ, పాడుతూ, ఊగుతూ విజయవాడ వచ్చేస్తున్నారు మన ‘కీడా కోలా’ బృందం అంటూ ఒక ఫన్నీ వీడియో విడుదల చేశారు.
Aaduthu, paaduthu, ooguthuu Vijayawada ochesthunnaru mana #KeedaaCola team! 🪳
Meet them at PVP mall from 6:30 PM today!#KeedaaColaOnNov3@TharunBhasckerD @RanaDaggubati @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @saregamasouth pic.twitter.com/rDFjknplVt
— VG Sainma (@VGSainma) October 22, 2023
వీజీ సైన్మా సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్, చైతన్య రావు మదాడి, రాగ్ మయుర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.