బాలీవుడ్ హీరో విక్కీకౌశల్తో కలిసి ఇటీవలే ఏడడుగులు వేసింది కత్రినాకైఫ్. ఈ జంట వివాహం రాజస్థాన్లోని భర్వారా కోటలో జరిగింది. నాలుగురోజుల పాటు జరిగిన ఈ పెళ్లివేడుకలో కత్రినాకైఫ్ పూర్తిగా పంజాబీభాషలోనే మాట్లాడినట్లు సమాచారం. విక్కీకౌశల్ పంజాబ్ రాష్ర్టానికి చెందినవారు. భర్త మాతృభాష పంజాబీ కావడంతో అతడి కోసం కత్రినాకైఫ్ ప్రత్యేకంగా ఆ భాషపై పట్టు పెంచుకున్నట్లు చెబుతున్నారు. పెళ్లికి కొద్ది నెలలు ముందుగా ఓ ట్యూటర్ను నియమించుకున్న పంజాబీ భాషను నేర్చుకున్నట్లు తెలిసింది. విక్కీ కౌశల్ కుటుంబసభ్యులతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులతో పూర్తిగా పంజాబీలోనే మాట్లాడిన కత్రినా అందరిని ఆశ్చర్యపరిచినట్లు చెబుతున్నారు. పెళ్లి వేడుకలను పూర్తిచేసుకున్న కొత్త జంట విక్కీకౌశల్, కత్రినాకైఫ్ మంగళవారం ముంబయి చేరుకున్నారు.