Karthik Kumar | తమిళ నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్ తన మాజీ భార్య సింగర్ సుచిత్రకు లీగల్ నోటీసులు పంపాడు. ఇటీవల ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుచిత్ర తన మాజీ భర్త కార్తీక్ కుమార్తో పాటు హీరో ధనుష్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్లు గేలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా నటుడు ధనుష్, కార్తీక్ కలిసి అర్థరాత్రి మగవాళ్లతో పార్టీలు చేసుకుంటారని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలపై కార్తీక్ లీగల్ నోటీసులు పంపాడు. ఈ మేరకు ఆమెపై కార్తీక్ పరువు నష్టం కేసు వేశాడు. తన ప్రతిష్ఠకు నష్టం కలిగించినందుకు రూ.కోటీ పరిహారం చెల్లించాలని కోరుతూ తన న్యాయవాది ద్వారా ఆమెకు మే 16న నోటీసులు పంపాడు. అయితే ఈ కేసును విచారించిన కోర్ట్.. కార్తీక్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సుచిత్రపై మధ్యంతర నిషేధం విధించింది. తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది.