దక్షిణాది సినీ పరిశ్రమలో న్యాచురల్ నటించే యాక్టర్లలో టాప్లో ఉంటాడు కార్తీ (Karthi). ఈ హీరో నటించిన తాజా చిత్రం విరుమన్ తమిళనాడులో హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం మణిరత్నం మల్టీస్టారర్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1)లో కీ రోల్ చేస్తుండగా..ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు కార్తి. ఇందులో భాగంగా ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు.
ఇటీవల విడుదలైన సినిమాల్లో మీరు (చేయాలనుకున్న చిత్రం) ఏదైనా మిస్సయ్యారా..? అని ఓ ఇంటర్వ్యూలో కార్తీని అడిగారు. దీనికి కార్తీ స్పందిస్తూ..ఆర్య నటించిన సూపర్ హిట్ సినిమా సార్పట్టా పరంపర (Sarpatta Parampara)ను మిస్సయ్యానని గుర్తు చేసుకున్నాడు. 2014లో తాను ఈ చిత్రానికి సంతకం చేశానని చెప్పాడు. అయితే ఆ టైంలో పా రంజిత్ కబాలి, కాలా సినిమాలతో బిజీగా ఉండటం..మరోవైపు కార్తీ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా అనుకోకుండా ఆర్య చేతికి వెళ్లిందట.
ఈ చిత్రంలో ఆర్య పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. మూవీలో వాథియార్, డాడీ రోల్స్ చాలా ఇష్టమని చెప్పాడు కార్తీ. పొన్నియన్ సెల్వన్ లో చోళ ఆర్మీ కమాండర్ వల్లవరాయన్ వండియ దేవన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన లుక్తోపాటు కార్తీపై వచ్చే పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కానుంది.