నీళ్ల మాఫియా గురించి చర్చిస్తూ సందేశాత్మక కథాంశంతో గూఢచారి థ్రిల్లర్గా రూపొందిన ‘సర్దార్’ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిన ‘సర్దార్-2’ సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. కార్తి కథానాయకుడిగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. బుధవారం రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ చిత్రబృందం కొత్త పోస్టర్ను పంచుకుంది.
ఈ సీక్వెల్లో అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి చర్చించబోతున్నట్లు తెలిసింది. గూఢచారి వ్యవస్థ చుట్టూ అల్లుకున్న ఈ కథలో దేశభక్తి, సామాజిక సందేశం ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మాళవిక మోహనన్, ఎస్జే సూర్య, ఆషికా రంగనాథ్, యోగిబాబు, రజిషా విజయన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, నిర్మాతలు: ఎస్.లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా, దర్శకత్వం: పీఎస్ మిత్రన్.