ఖమ్మం జిల్లా లకారం చెరువులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయవద్దని శ్రీ ఆదిభట్ల కళాపీఠం, యాదవ సంఘాల సహకారంతో పోరాటం చేస్తున్నానని, దీనికి ‘మా ’ అసోసియేషన్కు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి కరాటే కల్యాణి అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘మా’ అసోసియేషన్ అమ్మ లాంటిదని, సస్పెన్షన్కు గురిచేయడం బాధ కలిగించిందన్నారు. ఇందులో అధ్యక్షుడు మంచు విష్ణు తప్పు లేదని, కొందరి చర్యల వల్ల ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. మంచి ఉద్దేశ్యం కోసం తాను పోరాడుతున్నానని చెప్పారు. ఈ సమావేశంలో యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేకల రాములు యాదవ్, రాంచందర్ యాదవ్, చలసాని వెంకట్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రమేశ్ యాదవ్, దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.