Karan Johar | కరణ్ జోహార్ పరిచయం అక్కర్లేని పేరు. ఆయన బాలీవుడ్ బడా దర్శక నిర్మాతల్లో ఒకరు. అలాగే ఎక్కువగా ట్రోలింగ్కు గురవుతున్న బాలీవుడ్ సెలబ్రిటీల్లో కరణ్ ఒకరు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత కీలక నిర్ణయం తీసుకున్నాడు. ట్విట్టర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అంతే కాకుండా అకౌంట్ను డీయాక్టివేట్ చేశాడు. చివరి సారిగా చేసిన ట్వీట్లో ‘మరింత పాజిటివ్ వైబ్స్ కోసం ట్విట్టర్కు గుడ్బై చెబుతున్నట్లున్న కరణ్ ట్వీట్ చేశాడు. అయితే, ఈ ట్వీట్పై సైతం పలువురు నెజినట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరణ్ జోహార్ ట్విట్టర్ దూరం అవడం సరికాదని కొంత మంది పేర్కొనగా.. ఉండి మాత్రం ఏం చేస్తాడు అన్నట్లు మరికొందరు కామెంట్లు పెట్టారు.
బాలీవుడ్లోకి నటుడిగా ప్రవేశించిన కరణ్ జోహార్.. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. బాలీవుడ్ సూపర్హిట్ చిత్రం దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ను ప్రారంభించాడు. కుచ్ కుచ్ హోతా హై చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కరణ్.. ఇటీవల కాలం చిత్ర నిర్మాణాలపై దృష్టిని సారించాడు. అయితే బాలీవుడ్ నటుల వారసులను మాత్రమే ప్రోత్సహిస్తాడనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత ఎక్కువగా అభిమానులు కరణ్ను టార్గెట్ చేశారు. ఆ తర్వాత కరణ్ ఏ సినిమా చేసినా.. ‘బాయ్కాట్’ డిమాండ్ వినిపిస్తున్నది. ప్రస్తుతం పలు చిత్రాలను నిర్మించడంతో పాటు కాఫీ విత్ కరణ్ అనే రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు.