ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 26 : రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్కు చెందిన చిదుగు రవిగౌడ్(35) బ్రెయిన్ స్ట్రోక్తో సోమవారం హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రవిగౌడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ స్ఫూర్తితో సినిమాలపై మక్కువ పెంచుకుని అసోషియేట్ డైరెక్టర్గా ఎదిగి కర్ణాటక చిత్ర రంగంలో అడుగు పెట్టి కొంత కాలం బెంగుళూరులో ఉన్నాడు. 2021లో కన్నడ హీరో కన్నడ ప్రభాకర్ కొడుకు వినోద్ ప్రభాకర్తో షాడో సినిమాను తీశాడు.
కరోనా కారణంగా ఆ సినిమా డిజాస్టర్గా మిగిలిపోగా అప్పుల పాలయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రవిగౌడ్ అనారోగ్యం బారిన పడ్డాడు. 15 రోజుల క్రితం హైదరాబాద్లో అస్వస్థతకు గురికాగా, కుటుంబ సభ్యులు నిమ్స్ దవాఖానలో చేర్పించారు. సోమవారం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సినిమా రంగంలో ఎదుగుతున్నాడని గ్రామస్థులు భావించిన తరుణంలో రవిగౌడ్ మృతి బొప్పాపూర్లో తీవ్ర విషాదం మిగిల్చింది.