‘‘ఈ దేశంలో మహిళను దుర్గామాతతో పోలుస్తారు. ఆమె ఇప్పుడు స్త్రీ ద్వేషం అనే రాక్షసుడితో పోరాడాలి’ అని వ్యాఖ్యలు చేసింది కన్నడ నటి రమ్య. ‘పఠాన్’ సినిమాలో ధరించిన దుస్తులపై బాలీవుడ్ నటి దీపికా పడుకోన్పై ఓ వర్గం కావాలని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రమ్య పై విధంగా స్పందించింది. ‘విడాకుల విషయంలో సమంతను మాటలతో వేధిస్తారు, తన అభిప్రాయం చెప్పినందుకు సాయి పల్లవిని విమర్శిస్తారు.
నిశ్చితార్థం రద్దు చేసుకున్నందుకు రష్మిక మందన్నపై తప్పుడు ప్రచారాలు చేస్తారు. ఇప్పుడు పాటలో ధరించిన దుస్తులపై దీపికాను నిందిస్తున్నారు. ఇంకెందరో మహిళలు మరెన్నో విధాలుగా విద్వేషాన్ని ఎదుర్కొంటున్నారు. ఎలా కనిపించాలి, ఏం ధరించాలి, ఎలా ఉండాలి అనేది మహిళలుగా మా ప్రాథమిక హక్కు. దుర్గామాత లాంటి స్త్రీ…ఇప్పుడీ విద్వేషం అనే రాక్షసుడితో పోరాటం చేయాలి’ అని రమ్య సోషల్ మీడియా ద్వారా అభిప్రాయం వెల్లడించింది.