కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ నిత్యం వివాదాలతో హాట్ టాపిక్గా మారుతూ ఉంటుంది. తనకు అవసరం లేని విషయాల్లో కూడా దూరి సమస్యలను తెచ్చుకుంటుంది. తాజాగా కంగనా మరో సమస్యలో ఇరుక్కుంది. సాగు చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు దాదాపు సంవత్సరం నుండి నిరసనలు చేస్తున్నారు. అయితే ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం వారి నిరసనలకు తలొంచింది.
సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటనను ఇచ్చింది. ఇది విన్న రైతులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. అయితే కంగనా దీనిపై తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. దీన్ని ఓ ఖలీస్థానీ ఉద్యమం అని, రైతులను ఉగ్రవాదులని పేర్కొంది. సిక్ మతస్థులు ఆమెపై కేసు నమోదు చేయించారు. సుబుర్భన్ ఖన్ పోలీస్ స్టేషన్లో కంగనాపై కేసు నమోదయ్యింది. పలువురు సిక్ మత పెద్దలు కలిసి తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2009లో ప్రభాస్ జోడిగా ఏక్ నిరంజన్లో నటించింది కంగనా. ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్తోనే బిజీగా మారింది. క్వీన్, తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రాలతో బ్లాక్బస్టర్స్ సాధించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. హీరోయన్గా తనకంటూ ఓ మార్కెట్ను క్రియేట్ చేసుకుంది. మణికర్ణికతో డైరెక్టర్గానూ మారింది. రీసెంట్గా ఆమె నటించిన చిత్రం తలైవి. తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం థాకడ్, ఇందిరా గాంధీ బయోపిక్ చిత్రాలలో నటిస్తుంది.