బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సినిమాలతో బిజీగా ఉంటూ మరోవైపు రాజకీయాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. బీజేపీకి చాలా దగ్గరగా ఉంటూ వస్తున్న కంగనా రనౌత్ .. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ (ODOP) పథకానికి కంగనాను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవరిస్తారని యూపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను లక్నోలోని సీఎం అధికారిక నివాసంలో గౌరవ పూర్వకంగా కలిసింది కంగనా. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ భేటీ జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.సీఎం యోగి ఆదిత్యనాథ్తో భేటీ సందర్భంగా.. ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందంటూ కంగనా మెచ్చుకున్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు.
రామ మందిర భూమి పూజలో ఉపయోగించిన రామ దర్బార్ నాణెం తనకు బహుమతిగా ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పింది ఈ ఫైర్ బ్రాండ్. ప్రస్తుతం కంగనా సర్వేష్ మేవారా దర్శకత్వం వహిస్తున్న ‘తేజస్’లో కంగనా ఐఏఎఫ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. ‘ఢాకాడ్’, ‘మణికర్ణిక రిటర్న్స్’ మరియు ‘సీత: ది ఇన్కార్నేషన్’ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.