‘నాపైనే ఎందుకు అంత ద్వేషం.. నేనేం చేశాను మిమ్మల్ని?’ అంటూ వాపోతున్నది అందాలభామ కంగనారనౌత్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సోషల్ మీడియాపై తనకున్న అక్కసునంతా కక్కేసింది తను. ‘ నేను స్ట్రయిట్ ఫార్వాడ్గా ఉంటాను. నిర్మొమాటంగా మాట్లాడేస్తాను. నిజంలో బతుకుతాను. అదే కొందరికి నచ్చట్లేదు. ఆత్మాభిమానాన్ని చంపుకొని బతికేవాళ్లంతా లౌక్యం తెలిసినవాళ్లు. నిజాయితీగా ఉన్న నేను పొగరుబోతునా?’ అంటూ ఇంటర్వ్యూలో నేరుగా ప్రశ్నించింది. ఇంతకీ కంగనాకు అంత కోపం రావడానికి కారణం ఏంటంటే.. ఈ ముద్దుగుమ్మ సినిమాలపై కొందరు కావాలని కక్షగట్టి విడుదలకు ముందు నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారంట. ఈ విషయాన్ని తెలియజేస్తూ బాధను వ్యక్తం చేసింది కంగనా. ‘ ఈ మధ్య నా సినిమాలు సరిగ్గా ఆడలేదు. అవి జనరంజకంగా తయారవ్వకపోవడం ఒక కారణమైతే, కొందరు పనిగట్టుకొని చేసిన నెగిటీవ్ ప్రచారం ఒక కారణం. మిగతా హీరోయిన్ల విషయంలో సాఫ్ట్గా ఉంటారు. నా విషయానికొచ్చే సరికి అవాకులు చవాకులు రాస్తారు’ అంటూ మండిపడ్డది కంగనా. ఈమె బాధ పగవాళ్లకు కూడా రాకూడదని పలువురు మాట్లాడుకుంటున్నారు.