Kangana Ranaut | బాలీవుడ్ నటి కంగనారనౌత్ (Kangana Ranaut) పదేపదే ట్విట్టర్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఆమె ఖాతాను నిలిపేసిన విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు నెలకొన్న నేపథ్యంలో చేసిన వివాదాస్పద ట్వీట్లతో 2021 మేలో కంగనా అకౌంట్ (Twitter) నిలిపేశారు. దీంతో కంగనా ఇన్ స్టాగ్రామ్ నుంచి కూడా బయటకు వచ్చేసింది.
ఎలన్మస్క్ ట్విట్టర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సస్పెన్షన్కు గురైన పలువురు సెలబ్రిటీలు, ప్రపంచస్థాయి నేతల ఖాతాలను ట్విట్టర్ పునరుద్దరించింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్లోకి కంగనా రీఎంట్రీ ఇస్తూ.. అందరికీ హలో.. తిరిగి రావడం సంతోషంగా ఉంది..అంటూ ట్వీట్ చేసింది.
నేను నటిస్తున్న పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎమర్జెన్సీ అక్టోబర్ 20న విడుదల కానుందంటూ మరో అప్డేట్ కూడా ఇచ్చింది కంగనా. గతేడాది యాక్షన్ థ్రిల్లర్ 2022 ధాకడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కంగనా. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఈ భామ ఖాతాలో తేజాస్, చంద్రముఖి 2 (తమిళ్) సినిమాలు కూడా ఉన్నాయి.
Hello everyone, it’s nice to be back here 🙂
— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023
ఎమర్జెన్సీ షూటింగ్ అప్డేట్ ..
And it’s a wrap !!!
Emergency filming completed successfully… see you in cinemas on 20th October 2023 …
20-10-2023 🚩 pic.twitter.com/L1s5m3W99G— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023