Kangana Ranaut | ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైంది. గతంలో ఏ దేశంలో చేపట్టని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ మాడ్యూల్ను సాఫ్ట్ ల్యాండిం చేసి.. చారిత్రాత్మక విజయాన్ని సాధించి.. భారతీయులంతా గర్వపడేలా చేసింది. అయితే, చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంలో మహిళా శాస్త్రవేత్తలు సైతం తమవంతు సహకారం అందించారు. ఈ క్రమంలో మహిళా శాస్త్రవేత్తలు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వారిని కొనియాడింది. మహిళా శాస్త్రవేత్తలు సాదాసీదా జీవనం, ఉన్నతమైన ఆలోచనలకు ప్రతిరూమని పేర్కొన్నారు.
‘భారతదేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలలో బొట్టు బిళ్ల, తిలకం, మంగళ సూత్రం ధరించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వారి నిరాడంబర జీవితాలకు, అత్యున్నతమైన ఆలోచనలకు ఆ బొట్టు బిళ్ల, తిలకం, మంగళసూత్రం గుర్తులు నిదర్శనం. అదే అసలైన భారతీయత లక్షణం’ అంటూ కంగనా ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. కంగనా రనౌత్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నది. ప్రస్తుతం చంద్రముఖి-2 చిత్రంలో నటిస్తున్నది.
ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రజనీకాంత్, జ్యోతిక, ప్రభు తదితర నటీనటులు నటించిన బ్లాక్బాస్టర్ మూవీ చంద్రముఖి చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రం గణేశ్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానున్నది. అలాదే సమయంలో కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో నటిస్తున్నది. అనుపమ్ ఖేర్, సతీష్ కౌశిక్, మిలింద్ సోమన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో కంగనా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్లో ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్వయంగా కంగనా నిర్మించింది. ఈ సినిమా నవంబర్ 24న విడుదల కానుంది.