లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కమల్కు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కమల్ ఆరోగ్యం ఎలా ఉందో అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కూతురు శృతి హాసన్ తన ట్విట్టర్ ద్వారా స్పందించింది.
“నా తండ్రి ఆరోగ్యం గురించి ప్రార్ధించిన వారందరికి ధన్యవాదాలు. ప్రస్తుతం తను కోలుకుంటున్నాడు. త్వరలోనే మీ అందరితో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నారు” అంటూ ట్వీట్ చేసింది శృతి హాసన్. కమల్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు బిగ్ బాస్ షోకి హోస్ట్గా ఉన్నారు. కమల్కి కరోనా సోకిన నేపథ్యంలో వీకెండ్ ఎపిసోడ్స్కి గెస్ట్గా ఎవరిని తీసుకురావాలనే విషయంలో నిర్వాహకులు తర్జన భర్జన పడుతున్నారు. కమల్ వచ్చేంత వరకు ఆయన స్థానాన్ని ఆమె కూతురు శృతి హాసన్ భర్తీ చేయనున్నదట.సింగర్, నటి, ర్యాపర్.. ఇప్పుడు ఈ షో తో హోస్ట్ గా కూడా మారబోతుంది శృతి హాసన్