సకల కళావల్లభుడు కమల్ హాసన్ .. అమెరికాకు వెళ్లొచ్చిన తర్వాత కరోనా స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడగా, ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.. వైద్యుల సూచనలతో క్యారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నారు కమల్. రీసెంట్గా ఆయన కోలుకోవడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసిన కమల్.. తాను త్వరగా కోలుకోవాలని మనసారా ఆకాంక్షించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కు, ఇతర రాజకీయ నాయకులకు, అలానే ప్రముఖ నటుడు రజనీకాంత్ తో పాటు చిత్రసీమకు చెందిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కమల్కి కరోనా సోకడంతో ఆయన చేస్తున్న ప్రాజెక్టులు అన్నింటికి బ్రేక్ పడింది. బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంకి కూడా కమల్ షార్ట్ బ్రేక్ ఇచ్చాడు. కమల్ గైర్హాజరుతో రమ్యకృష్ణ వీకెండ్లో సందడి చేశారు. అయితే కమల్ కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఆయన ఐసోలేషన్లో లేకుండా బిగ్ బాస్ షోలో పాల్గొన్నారట. ఐసోలేషన్లో ఉండకుండా షూటింగ్కు హాజరవడంతో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది . కరోనా నిబంధనలు ఉల్లంఘించి బిగ్ బాస్ షూటింగ్లో పాల్గొనడం కరెక్ట్ కాదని..పూర్తిగా కోలుకోకుండానే షూటింగ్లకు హాజరైతే మిగతావారికీ వైరస్ వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ ఘటన పై తక్షణమే వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ నుండి నోటీసులు జారీ చేసింది తమిళ్ సర్కార్.